Andhra Pradesh: విశాఖ మన్యంలో దారుణం.. గిరిజన యువతిపై అత్యాచారం, హత్య!

  • అరకులోయలో ఘటన
  • తలపై బండరాయితో మోది హత్య
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని అరకులోయ ప్రాంతంలో ఓ గిరిజన యువతిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ఈ విషయాన్ని బయటకు చెబుతుందన్న భయంతో తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఈరోజు ఉదయాన్నే యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

More Telugu News