India: వెస్టిండీస్ తో మొదటి టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో 297 పరుగులకు ఆలౌటైన టీమిండియా

  • 81 పరుగులు చేసిన రహానే
  • లోయరార్డర్ లో వచ్చి ఫిఫ్టీ కొట్టిన జడేజా
  • నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించిన కీమార్ రోచ్

వెస్టిండీస్ తో నార్త్ సౌండ్ లో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 297 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ లో రహానే 81 పరుగులు చేయగా, లోయరార్డర్ లో వచ్చిన రవీంద్ర జడేజా 58 పరుగులతో రాణించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 44, విహారి 32, పంత్ 24 పరుగులు సాధించారు. 203/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ ను కీమార్ రోచ్ మరోసారి దెబ్బకొట్టాడు. పంత్ ను అవుట్ చేసి భారత పతనానికి శ్రీకారం చుట్టాడు. విండీస్ బౌలర్లలో రోచ్ 4, గాబ్రియెల్ 3 వికెట్లు తీశారు. స్పిన్నర్ రోస్టన్ చేజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

More Telugu News