Tirumala: టీడీపీ, బీజేపీలు సీఎం జగన్ పై బురద చల్లాలని చూస్తున్నాయి: వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

  • ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం ఘటనపై స్పందన
  • టీడీపీ హయాంలోనే అనుమతిచ్చింది
  • జగన్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు

తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరగడంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ టికెట్లపై అన్యమత ప్రచారం చేసేందుకు టీడీపీ హయాంలోనే అనుమతులు ఉన్నాయని, ఈ వ్యవహారంలో కొందరు అధికారుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే దేవాదాయ శాఖ ప్రాథమిక విచారణ చేసిందని, ఇందుకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సీఎం జగన్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ, బీజేపీలు ఉద్దేశపూర్వకంగా ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు ఏపీలో ఉనికి కోసం లేనిపోని హడావుడి చేస్తున్నాయని దుయ్యబట్టారు.

More Telugu News