Saaho: ప్రభాస్ 'సాహో' చిత్రానికి సెన్సార్ పూర్తి

  • U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
  • సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాల 52 సెకన్లు
  • ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'సాహో'

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన 'సాహో' చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాల 52 సెకన్లు. హాలీవుడ్ తరహా యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిన 'సాహో' ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. 

More Telugu News