vijayasaireddy: విజయసాయిరెడ్డికి ఘాటు కౌంటర్ ఇచ్చిన కేశినేని!

  • అమరావతిలో కేశినేనికి భూములు ఉన్నాయన్న విజయసాయిరెడ్డి
  • అక్కడ నాకు భూమి ఉందని రుజువు చేయాలి
  • రుజువు చేస్తే ఆ భూమిని ప్రభుత్వానికి రాసి ఇస్తా

టీడీపీ నేత కేశినేని నానికి ఏపీ రాజధాని అమరావతిలో భూములు ఉన్నాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. తనకు కానీ, తన కుటుంబానికి గాని, తనకు సంబంధించిన వారికి కానీ అమరావతిలో ఒక్క అంగుళం భూమి ఉందని రుజువు చేస్తే ఆ భూమిని ప్రభుత్వానికి రాసి ఇస్తానని లేకుంటే ‘మీరేమి చేస్తారో కొంచెం చెబుతారా? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు.

More Telugu News