Vijayasai Reddy: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం ఆగ్రహం?

  • అన్ని పనులు మోదీకి చెప్పే చేస్తున్నామన్న విజయసాయి
  • విజయసాయి, అజయ్ కల్లాంను ఢిల్లీకి పిలిపించిన పీఎంవో
  • పీపీఏ సమీక్షలు, రీటెండర్లపై వివరణ ఇచ్చిన విజయసాయి, కల్లాం

ఏపీలో రీటెండరింగ్ పనులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పే చేస్తున్నామంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాంను ఢిల్లీకి పిలిపించింది. కాసేపటి క్రితం ప్రధాని కార్యాలయానికి విజయసాయి, అజయ్ కల్లాం చేరుకున్నారు. ఈ సందర్భంగా పీపీఏ సమీక్షలు, పోలవరం రీటెండర్లపై వారు వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News