Kadapa: 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.. వైసీపీ నేతలు భూకబ్జాకు యత్నిస్తున్నారు!

  • కడప ఎన్టీఆర్ నగర్ లో పేదల గుడిసెల కూల్చివేత
  • పోలీసుల సహకారంతో కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
  • ఆత్మహత్యకు యత్నించిన బాధితులు

కడపలోని ఎన్టీఆర్ నగర్ లో పేదల గుడిసెలను కూల్చివేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. గుడిసెలను కూల్చివేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అయితే, పోలీసుల సహకారంతో వారు గుడిసెలను కూల్చివేశారు. దీంతో, కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి బాధితులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, వైసీపీ నేతలు స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. తాము 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని చెప్పారు. అధికారుల కాళ్లు పట్టుకుని బ్రతిమలాడినా... తమ గుడిసెలను కూల్చేశారని కన్నీటిపర్యంతం అయ్యారు.

More Telugu News