Vizag: భీమిలిలో గంటా గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం!

  • ఈ మేరకు జీవీఎంసీ ప్లానింగ్ విభాగం నోటీసులు జారీ 
  • 24 గంటల్లోగా గెస్ట్ హౌస్ ను కూల్చివేస్తామని ప్రకటన
  • గెస్ట్ హౌస్ వద్ద జీవీఎంసీ సిబ్బంది, పోలీసులు

విశాఖపట్టణం జిల్లాలోని భీమిలిలో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం అవుతోంది. కొంచెం సేపటి క్రితం జీవీఎంసీ ప్లానింగ్ విభాగం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇరవై నాలుగు గంటల్లోగా గెస్ట్ హౌస్ ను కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. గంటా గెస్ట్ హౌస్ వద్దకు జీవీఎంసీ సిబ్బంది చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న గంటా వర్గీయులు మండిపడుతున్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే గెస్ట్ హౌస్ ను కూల్చేందుకు చూస్తున్నారని ఆరోపించారు. 

More Telugu News