Srikrishnastami: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్ హరిచందన్, సీఎం జగన్

  • శాంతి, పురోగతి, శ్రేయస్సుతో ప్రజలు వర్థిల్లాలి
  • సోదరభావం, స్నేహం, సామరస్యత మరింత పెరగాలి
  • చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తు ఈ పర్వదినం

రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ వేర్వేరు ప్రకటనల్లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, పురోగతి, శ్రేయస్సుతో ప్రజలు వర్థిల్లాలని ఆకాంక్షించారు. సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి ఈ పర్వదినం పునాది అని, సోదరభావం, స్నేహం, సామరస్యత మరింత పెరగాలని గవర్నర్ ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా ప్రజలంతా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారని జగన్ పేర్కొన్నారు. ప్రజల జీవితాలు సంతోషమయం కావాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News