ED: చిదంబరం కేసులో ట్విస్ట్.. ఈడీ అధికారి బదిలీ

  • ఈడీ అధికారి రాకేశ్ అహూజా బదిలీ
  • ఢిల్లీ పోలీసు విభాగానికి ట్రాన్స్ ఫర్
  • అహూజా డిప్యుటేషన్ కాలం ముగిసిందన్న ఈడీ

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నిందితుడిగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారి రాకేశ్ అహూజా బదిలీ అయ్యారు. ఢిల్లీ పోలీస్ విభాగంలోకి ఆయనను బదిలీ చేశారు. చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ బదిలీ జరగడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ఈడీ డైరెక్టరేట్ లో రాకేశ్ అహూజా డిప్యుటేషన్ కాలం మూడు వారాల క్రితమే ముగిసిందని ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి.

More Telugu News