Sensex: ఆర్థిక సంక్షోభం భయాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 587 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 177 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 587 పాయింట్లు పతనమై 36,472కి పడిపోయింది. నిఫ్టీ 177 పాయింట్లు కోల్పోయి 10,741కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.57%), టీసీఎస్ (1.33%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.03%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.58%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-13.91%), వేదాంత లిమిటెడ్ (-7.76%), బజాజ్ ఫైనాన్స్ (-4.39%), టాటా మోటార్స్ (-4.14%), ఓఎన్జీసీ (-3.55%).

More Telugu News