USA: మనిషి రక్తం రుచిమరిగిన షార్క్ చేప.. ఒకే మహిళపై రెండు సార్లు దాడి!

  • అమెరికాకు చెందిన హవాయీ దీవుల్లో ఘటన
  • కీలకేకువా తీర ప్రాంతంలో ఈతకు వెళ్లిన మహిళ
  • సముద్రంలోకి ఎవ్వరూ వెళ్లకుండా అధికారుల జాగ్రత్తలు

అమెరికాకు చెందిన ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం  హవాయీ దీవుల వద్ద ఓ షార్క్(సొర చేప) రెచ్చిపోయింది. సముద్రంలో ఈతకొడుతున్న ఓ మహిళ(27)పై దాడికి దిగింది. ఇలా రెండుసార్లు సదరు మహిళపై దాడిచేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కీలకేకువా తీర ప్రాంతంలో సదరు మహిళ ఈత కొడుతుండగా ఓ షార్క్ ఆమెపై దాడిచేసింది.

షార్క్ పదునైన పళ్లు దిగడంతో నడుము కిందిభాగం, కుడికాలి తొడకు లోతైన గాయాలై, రక్తస్రావం జరిగింది. ఈ ఘటన సముద్రతీరానికి 50 మీటర్ల పరిధిలోనే జరిగిందని హవాయీ అధికారులు చెప్పారు. మనిషి రక్తం రుచి మరిగిన షార్క్ ఇంకా ఇదే జలాల్లో తిరుగుతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు, స్థానికులు సముద్రంలో ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

More Telugu News