Andhra Pradesh: మంత్రులు బొత్స, అవంతి తలా ఓ రకంగా మాట్లాడుతున్నారు!: బీజేపీ నేత సుజనా చౌదరి

  • రాజధాని అమరావతిపై బొత్స వ్యాఖ్యలపై స్పందన
  • వీళ్లిద్దరి అభిప్రాయాలు ప్రభుత్వానివా? వ్యక్తిగతమా?
  • రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారు

రాజధాని అమరావతి తరలింపు విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రస్తావించారు. ఢిల్లీలో మీడియాతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై బొత్స, మంత్రి అవంతి శ్రీనివాస్ తలా ఒక రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వీళ్లిద్దరి అభిప్రాయాలు ప్రభుత్వానివా? వారి వ్యక్తిగతమా? అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి సుజనా చౌదరి ప్రస్తావించారు. రివర్స్ టెండరింగ్ విషయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని  ప్రశ్నించారు.

More Telugu News