Andhra Pradesh: దరిద్రానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • ఏపీలో ఎక్కడా చుక్క వర్షం లేదు
  • ఎవరు ప్యాంటు తడుపుకున్నారో అందరికీ తెలుసు
  • విజయసాయిరెడ్డికి టీడీపీ నేత కౌంటర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చూసి చంద్రబాబు వణికిపోతున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన విమర్శలను టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. మోదీ, అమిత్ షాను చూసి ప్యాంటు ఎవరు తడుపుకుంటున్నారో మోదీ తిరుపతి టూర్ లో ప్రజలంతా చూశారని వెంకన్న తెలిపారు. కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు కాళ్లు పట్టుకుంటున్న విజయసాయిరెడ్డి కూడా ధైర్యం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

దరిద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే, రాష్ట్రంలో చుక్కనీరు కూడా కురవడం లేదని విమర్శించారు. వరదను రాజకీయం చేయాలనుకుని రాయలసీమలో చుక్క నీరులేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయసాయిరెడ్డి చెత్త ఐడియాలతో జగన్ అమెరికా పర్యటన మొత్తం తుస్సుమందని ఎద్దేవా చేశారు. జగన్ అమెరికా నుంచి వచ్చేలోపు విజయసాయిరెడ్డి వెళ్లి రైతుల బుగ్గలు నిమిరే కార్యక్రమం మొదలుపెట్టాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News