KTR: సవాల్ విసిరే ముందు మీ నాన్న పర్మిషన్ తీసుకున్నారా?: కేటీఆర్ కు విజయశాంతి ప్రశ్న

  • ప్రాజెక్టుల్లో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందన్న నడ్డా
  • దమ్ముంటే అవినీతిపై ఆధారాలు చూపించాలన్న కేటీఆర్
  • ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా ఇదే మాదిరి సవాల్ విసిరారన్న విజయశాంతి

ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... దమ్ముంటే అవినీతిపై ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సెటైర్లు వేశారు.

'కేటీఆర్ గారు, సవాల్ విసిరే ముందు మీ నాన్న కేసీఆర్ పర్మిషన్ తీసుకున్నారా?' అని విజయశాంతి అన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా కేటీఆర్ ఇదే మాదిరి సవాల్ విసిరారని ఎద్దేవా చేశారు. మరోవైపు, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

More Telugu News