Telangana: ఇంజనీరింగ్ యువతికి ల్యాబ్ టెక్నీషియన్ వేధింపులు.. చితక్కొట్టిన విద్యార్థులు!

  • తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఘటన
  • పరీక్ష రాసేందుకు వచ్చిన యువతికి టార్చర్
  • నిందితుడిని పోలీసులకు అప్పగించిన విద్యార్థులు

ఇటీవలి కాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. స్కూళ్లు, కాలేజీలతో పాటు బస్టాండ్లలో కూడా అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా తెలంగాణలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ కామాంధుడు కాలేజీ ఆవరణలోనే వేధించగా, అక్కడే ఉన్న విద్యార్థులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు ఓ అమ్మాయి వచ్చింది. అయితే అక్కడే ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న వెంకటేశ్, యువతిని వేధించడం ప్రారంభించాడు. దీంతో తిరగబడ్డ అమ్మాయి అతని కాలర్ పట్టుకుంది. బరబరా బయటకు ఈడ్చుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థులు వెంకటేశ్ ను చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా, తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వెంకటేశ్, క్షమించాలని కోరుతూ యువతికి లేఖ రాసి ఇచ్చాడు.

More Telugu News