Andhra Pradesh: ఏపీలో ఉగ్రరూపం దాల్చనున్న గోదారమ్మ.. హెచ్చరించిన ఆర్టీజీఎస్!

  • రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
  • శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి ప్రాంతాల్లో కుండపోత
  • భారీగా వరద రావొచ్చన్న ఆర్టీజీఎస్

గోదావరి నదికి మరోసారి భారీ వరద పోటెత్తే అవకాశముందని ఏపీకి చెందిన ఆర్టీజీఎస్ హెచ్చరించింది. నేటి నుంచి రాబోయే 3 రోజులు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుందని చెప్పింది.

ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఇప్పటికే వరద తాకిడితో అల్లాడుతున్న గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు తాజా వర్షాలతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొనే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News