Andhra Pradesh: కృష్ణా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు!

  • హైదరాబాద్ నుంచి గన్నవరానికి రాక
  • విజయవాడలో వరద బాధితులతో సమావేశం
  • చంద్రబాబుకు తమ కష్టాలు చెప్పుకున్న నగర వాసులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గీతానగర్, భూపేశ్ గుప్తా నగర్, తారకరామా నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ సమస్యలను చంద్రబాబుతో చెప్పుకున్నారు. వరదల కారణంగా పిల్లలతో పాటు తామంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకొచ్చారు.

కాగా, ఈ పర్యటన ముగిశాక చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు తెలుగుదేశం నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు.

More Telugu News