Andhra Pradesh: గతంలో హైదరాబాదు నుంచి ఏపీ అసెంబ్లీకి తరలిస్తున్న ఫర్నీచర్, ఏసీలు మాయం.. ఆలస్యంగా వెలుగులోకి!

  • కోడెల స్పీకర్ గా ఉన్న సమయంలో ఘటన
  • 2017, మార్చి నెలలో అసెంబ్లీ సామగ్రి తరలింపు
  • నరసరావుపేట, సత్తెనపల్లికి తరలినట్లు ఆరోపణలు

ఏపీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని 2017, మార్చిలో అమరావతికి తరలించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి చెందిన కొంత ఫర్నీచర్ తో పాటు ఏసీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీకి హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ ను తరలిస్తుండగా, కొంత మాయమైందని అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదులో తెలిపారు. కాగా, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్నప్పుడే ఈ ఫర్నీచర్ మాయమయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫర్నీచర్, ఏసీలను సత్తెనపల్లి, నరసరావుపేటలకు తరలించినట్లు గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

More Telugu News