Vaishnav tej: 'ఉప్పెన' కోసం రంగంలోకి దిగిన విజయ్ సేతుపతి

  • వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన'
  • ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి
  • జాలరుల కుటుంబాల నేపథ్యంలో సాగే కథ  

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా 'ఉప్పెన' రూపొందుతోంది. ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సముద్రతీర ప్రాంతంలోని జాలరుల కుటుంబాలకి చెందిన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో కథానాయిక తండ్రిగా ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.

ఇటీవలే కాకినాడలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ - సారథి స్టూడియోలో ప్లాన్ చేశారు. ఇక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగు జరుగుతోంది. ఈ రోజున ఈ సినిమా షూటింగులో విజయ్ సేతుపతి జాయిన్ అయ్యాడు. ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలనే వరుసగా చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కథానాయికగా పరిచయం కానుంది.  

More Telugu News