congress: కాంగ్రెస్ నేత చిదంబరానికి ఈడీ సమన్లు

  • యూపీఏ హయాంలోని విమానయాన కుంభకోణం కేసు
  • విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు
  • ఈ నెల 23న విచారించనున్న అధికారులు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారుల ఎదుట ఈ నెల 23న హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొంది. యూపీఏ హయాంలో విమానయాన కుంభకోణం కేసుకు సంబంధించి మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ను ఈడీ ఇప్పటికే విచారించింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ ఎదుట చిదంబరం హాజరుకానుండటం గమనార్హం. కాగా, ఎయిర్ సెల్ మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ ఇండియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ విచారణను చిదంబరం ఎదుర్కోన్నారు.

More Telugu News