Andhra Pradesh: ‘నేను చూడను’ అంటూ జగన్ అమెరికా పారిపోయారు: చినరాజప్ప

  • వరదలపై ముందస్తు చర్యలు తీసుకోలేదు
  • అధికారులు రివర్స్ టెండరింగ్ చుట్టూ తిరుగుతున్నారు
  • మంత్రులేమో చంద్రబాబు నివాసం చుట్టూ  

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత చినరాజప్ప విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరదలపై ముందస్తు చర్యలు తీసుకోకుండా జగన్ విదేశాలకు వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ పదేపదే చెప్పిన నినాదాన్ని గుర్తు చేస్తూ సెటైర్లు విసిరారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అన్న జగన్ ‘నేను చూడను’ అంటూ అమెరికా పారిపోయారని, అధికారులు రివర్స్ టెండరింగ్ చుట్టూ, మంత్రులు చంద్రబాబు నివాసం చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

More Telugu News