Virat Kohli: 11 ఏళ్ల క్రితం నాటి ఫొటోను చూపుతూ... విరాట్ కోహ్లీ స్పెషల్ పోస్ట్!

  • 2008, ఆగస్టు 18న భారత జట్టులోకి కోహ్లీ
  • నిన్నటితో 11 సంవత్సరాలు పూర్తి
  • ట్విట్టర్ లో స్పందించిన విరాట్

సమకాలీన క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కోహ్లీ, క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి 11 సంవత్సరాలు గడిచింది. 2008, ఆగస్టు 18న దంబుల్లాలో జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై తన అరంగేట్రాన్ని చేసిన కోహ్లీ, ఆపై ఇంతింతై, వటుడింతై అన్నట్టు ఎదుగుతూ వచ్చాడు. టెస్టులు, వన్డేలు, టీ-20లు కలిపి 68 సెంచరీలు, 95 హాఫ్ సెంచరీలతో మొత్తం 20, 502 పరుగులు సాధించాడు.

భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల క్రికెటర్ల జాబితాలో సచిన్ తరువాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తన కెరీర్ మొదలై 11 సంవత్సరాలు అయిన సందర్భంగా, అప్పటి ఫొటోను జతచేస్తూ, కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టగా అది వైరల్ అయింది. "పదకొండు సంవత్సరాల క్రితం టీనేజర్‌ గా అడుగు పెట్టాను. ఈ సుదీర్ఘ ప్రయాణం నన్ను మరింత ప్రతిబింబించేలా చేసింది. దేవుడు నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదిస్తాడని అనుకోలేదు. మీ కలల్ని సాకారం చేసుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోండి. అందుకు తగ్గట్టుగా శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకోండి" అంటూ పేర్కొన్నాడు. 

More Telugu News