Bengaluru: తాగిన మత్తులో ఫుట్‌పాత్‌పైకి కారు.. పిట్టల్లా ఎగిరిన పాదచారులు!

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కారు
  • ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు
  • పోలీసుల అదుపులో డ్రైవర్

బెంగళూరులో జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియని ఓ కారు డ్రైవర్ ఏకంగా ఫుట్‌పాత్‌పైకే పోనిచ్చాడు. దానిపై నడుచుకుంటూ వెళ్తున్న ఏడుగురిని ఢీకొట్టాడు. వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొనడంతో వారంతా పిట్టల్లా ఎగరిపడ్డారు.

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. కారు ఢీకొనడంతో వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News