RSS: రిజర్వేషన్లపై మరోసారి స్పందించిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

  • రిజర్వేషన్లపై శాంతియుత చర్చలు జరగాలి
  • రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నవారి భావాలను అర్థం చేసుకోవాలి
  • వ్యతిరేకించేవారి భావాల గురించి కూడా ఆలోచించాలి

రిజర్వేషన్లపై శాంతియుత వాతావరణంలో చర్చించాలని ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సూచించారు. రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నవారి భావాలను అర్థం చేసుకోవాలని... ఇదే సమయంలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారి భావాల గురించి కూడా ఆలోచించాలని అన్నారు. రిజర్వేషన్లపై తాను ఎప్పుడు మాట్లాడినా వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వస్తోందని అన్నారు. గతంలో తాను ఇదే విషయంపై మాట్లాడినప్పుడు... అది పూర్తిగా తప్పుదోవ పట్టిందని చెప్పారు.

గతంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, రిజర్వేషన్లపై పున:సమీక్షించాలని కోరారు. ఈ వ్యాఖ్యలు పెను దుమరాన్నే రేపాయి. వివిధ కుల, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఆయన మరెప్పుడూ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడలేదు. నిన్న ఢిల్లీలో జరిగిన 'జ్ఞాన్ ఉత్సవ్' ముగింపు సభలో ప్రసంగిస్తూ, రిజర్వేషన్లపై శాంతియుత చర్చలు జరగాలని కోరారు.

More Telugu News