Maharashtra: మహారాష్ట్రలో బస్సు-కంటెయినర్ ఢీ.. 12 మంది ప్రయాణికుల దుర్మరణం

  • ఔరంగాబాద్ కు వెళ్తున్న బస్సు
  • అతి వేగమే ప్రమాదానికి కారణం
  • మరికొందరి పరిస్థితి విషమం

మహారాష్ట్రలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దులే జిల్లా దొండైచ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు-కంటెయినర్ ఒకదాన్నొకటి వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బస్సు ఔరంగాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు.

More Telugu News