cm: సీఎం కేసీఆర్ కృషి ఫలించింది, కల నెరవేరింది: పీఎఫ్సీ సీఎండీ రాజీవ్ శర్మ

  • ‘కాళేశ్వరం’ గురించి దేశమంతా చెప్పుకుంటున్నారు
  • రాష్ట్ర అభివృద్ధిలో పీఎఫ్సీ భాగస్వామి కావడం గర్వంగా ఉంది
  • గతంలో కేసీఆర్ ఏం చెప్పారో అది ఇప్పుడు కళ్ల ముందు కనిపించింది

జెన్ కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్ శర్మను తెలంగాణ సీఎం కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా రాజీవ్ శర్మ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కృషి ఫలించిందని, ఆయన కల నెరవేరిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దేశమంతా చెప్పుకుంటున్నారని, అమెరికాలోని ‘న్యూయార్క్ టైమ్ స్క్వేర్’ లోనూ ఈ ప్రాజెక్టు విజయగాథను ప్రదర్శించారని కొనియాడారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు తాము అందించిన సహకారం సద్వినియోగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పీఎఫ్సీ భాగస్వామి కావడం తమకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మూడున్నరేళ్ల కింద కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేసీఆర్ తమకు చెప్పారని గుర్తుచేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, పంపుహౌస్ లను సందర్శించి చూశానని, గోదావరి నీటిని పంపింగ్ చేసే విధానం అద్భుతమని, మూడున్నరేళ్ల కిందట కేసీఆర్ ఏం చెప్పారో అది ఇప్పుడు కళ్ల ముందు కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News