Andhra Pradesh: షిరిడీ, శబరిమలలో ఏపీ యాత్రికుల వసతి కోసం చర్యలు

  • మహరాష్ట్ర, కేరళ ప్రభుత్వాలను కోరనున్న ప్రభుత్వం
  • వసతి, అతిథి గృహనిర్మాణానికి భూమిని కేటాయించాలి
  • దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శికి మంత్రి వెల్లంపల్లి ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి షిరిడీ, శబరిమల ఆలయాలను సందర్శించే యాత్రికులు, భక్తులు ఏటా లక్షలాది మంది ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో   షిరిడీ, శబరిమలలో వసతి, అతిథిగృహ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిందిగా మహారాష్ట్ర, కేరళ ప్రభుత్వాలను ప్రభుత్వం కోరనుంది. షిరిడీ సాయిబాబా సంస్ధాన్‌ ట్రస్ట్, శబరిమల ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ట్రస్ట్‌లతోను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోను సంప్రదించి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా దేవాదాయశాఖ ప్రత్యేక కార్యదర్శిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.

More Telugu News