Somireddy: మీరే సర్దుకోండని పోలీసులు చెబుతున్నారు: సోమిరెడ్డి

  • టీడీపీ నేతల ఇళ్లను కూలగొట్టారు
  • జిల్లా కలెక్టర్ కూడా న్యాయం  చేయలేకపోతున్నారు
  • ప్రజలకు పోలీసులు ఏం సమాధానం చెబుతారు

కావాలనే టీడీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లను వైసీపీ టార్గెట్ చేసిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని జనార్ధన్ కాలనీలో ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నారని... అర్బన్ హౌసింగ్ కింద ఇక్కడి ఇళ్లను ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కట్టించిందని... అయినా వాటిని కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను ఎందుకు కూల్చారో అర్థం కావడం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ ను కూడా కలిశామని... ఆయన కూడా న్యాయం చేయలేకపోతున్నారని అన్నారు. పోలీసులు కూడా నిస్సహాయులుగా మారారని... మీరే సర్దుకోండని సూచిస్తున్నారని చెప్పారు. వెయ్యి మంది పోలీసులను కాపలా పెట్టి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజలకు పోలీసులు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ఇంతటి దారుణ పరిస్థితులను తానెప్పుడూ చూడలేదని తెలిపారు.

More Telugu News