Arogyasree: తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ

  • 242 ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
  • రూ. 1500 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన
  • ఆసుపత్రుల యాజమాన్యాలతో భేటీకానున్న ఈటల రాజేందర్

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 242 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఈ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో... ఈ పథకాన్ని కొనసాగించేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు నిరాకరించాయి. బిల్లులు రాకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రూ. 1500 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగాయి. ప్యాకేజీ రేట్లను సవరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ మధ్యాహ్నం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీకానున్నారు.

More Telugu News