Andhra Pradesh: పులికాట్ సరస్సులో బోల్తా కొట్టిన పడవ.. నీటిలో ఎగిరిపడ్డ 40 మంది ప్రయాణికులు!

  • నెల్లూరు జిల్లాలోని తడ మండలంలో ఘటన
  • అదుపు తప్పి బోల్తా కొట్టిన పడవ
  • 40 మందిని కాపాడిన ఇతర పడవల యజమానులు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఈరోజు పడవ ప్రమాదం చోటుచేసుకుంది. తడ మండలంలోని ఇరకందీవి నుంచి భీములవారి పాలేనికి పులికాట్ సరస్సు మీదుగా ఓ పడవ బయలుదేరింది. ఇందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే పడవ కొద్దిదూరం వెళ్లగానే ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది.

దీంతో పడవలోని 40 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఈ ఉప్పునీటి సరస్సులో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర జాలర్లు, పడవ యజమానులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను కాపాడారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News