Supreme Court: అరగంట చదివినా ఏమీ అర్థం కాలేదు: 'ఆర్టికల్ 370' రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టు సీజే రంజన్ గొగోయ్

  • పిటిషన్ దాఖలు చేసిన ఎంఎల్ శర్మ
  • 370 రద్దుపై స్టే ఇవ్వాలని కోరిన పిటిషనర్
  • పిటిషన్ ఎందుకు వేశారో తెలియడం లేదన్న సీజే

జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను ఈ ఉదయం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను మీ పిటిషన్ ను అరగంటపాటు చదివాను. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీరు ఈ పిటిషన్ ను ఎందుకు వేశారో తెలియడం లేదు" అని వ్యాఖ్యానించారు. కాగా, సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, ఆర్టికల్ 370 రద్దుపై స్టే ఇవ్వాలని ఆయన కోరిన సంగతి తెలిసిందే.

More Telugu News