Chandrababu: ప్రజలు ఏం తప్పు చేశారని ఇంతలా శిక్షిస్తున్నారు?: చంద్రబాబునాయుడు

  • అన్న క్యాంటీన్లు మూసివేసిన వైసీపీ ప్రభుత్వం
  • లక్షలాది మంది భోజనం చేసే అవకాశం కోల్పోయారు
  • 20 వేల మందికి ఉపాధి పోయిందన్న చంద్రబాబు

అన్న క్యాంటీన్ల మూసివేతపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు ఏం తప్పు చేశారని ఇటువంటి శిక్ష విధించారని ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "నామమాత్రంగా ఐదు రూపాయలకే పోషకాలతో కూడిన భోజనాన్ని చేసే అవకాశాన్ని లక్షలాది మంది కోల్పోయారు. దాదాపు 20 వేల మందికి పైగా ఉద్యోగులు వారి జీవనాధారాన్ని కోల్పోయారు. ప్రజలు ఏం తప్పు చేశారని ఈ విధంగా శిక్షిస్తున్నారు?" అని అడిగారు. 

More Telugu News