south central railway: హైదరాబాద్-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు..రద్దీని తట్టుకునేందుకే!

  • 17, 19 తేదీల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న రైలు
  • తిరుగు ప్రయాణంలో 18, 20న శ్రీకాకుళం రోడ్‌ నుంచి 
  • సద్వినియోగం చేసుకోవాలన్న రైల్వే

ఈ నెల 17, 19 తేదీల్లో హైదరాబాద్-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు (07026)ను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రైలు నడవనున్న ఈ రెండు రోజుల్లోనూ సాయంత్రం ఏడున్నర గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:53 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 1:10 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

తిరుగు ప్రయాణంలో 18, 20 తేదీల్లో రైలు (07025) శ్రీకాకుళం రోడ్ నుంచి మధ్యాహ్నం 1:15 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకే ఈ రైలును నడుపుతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

More Telugu News