VDP Associates: అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో జగన్ కు మూడోస్థానం

  • వీడీపీ అసోసియేట్స్ 'దేశ్ కా మూడ్' సర్వే  
  • ప్రథమస్థానంలో ఒడిశా సీఎం
  • కేసీఆర్ కు ఐదోస్థానం

ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్ సంస్థ 'దేశ్ కా మూడ్' పేరిట నిర్వహించిన ఓ సర్వేలో 71 శాతం మంది జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వీడీపీ అసోసియేట్స్ 'దేశ్ కా మూడ్' పేరిట ఈ సర్వే చేపట్టింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్ పట్ల అత్యధికులు హర్షం వ్యక్తం చేసినట్టు వీడీపీ సర్వేలో వెల్లడైంది. కాగా, ఈ మోస్ట్ పాప్యులర్ సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నంబర్ వన్ గా నిలిచారు. రెండో స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదో స్థానం దక్కింది.

More Telugu News