Shanmugavel: తమిళనాడులో దొంగలను ఎదిరించిన వృద్ధ దంపతులకు సాహస అవార్డు ప్రదానం చేసిన ప్రభుత్వం

  • వృద్ధ దంపతులపై దొంగల దాడి
  • వీరోచితంగా ఎదుర్కొన్న వృద్ధులు
  • కాలికి బుద్ధి చెప్పిన దొంగలు
  • వృద్ధ దంపతుల సాహసాన్ని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం

ఇటీవల సాయుధులైన దొంగలను అత్యంత సాహసంతో ఎదిరించి తరిమికొట్టిన తమిళనాడు వృద్ధ దంపతులకు అక్కడి ప్రభుత్వం సాహస అవార్డు ప్రదానం చేసింది. ఇటీవలే తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న షణ్ముగవేల్ అనే వృద్ధుడితో ఓ దొంగ దాడికి దిగగా, షణ్ముగవేల్ కేకలు విని ఆయన భార్య చేతికి దొరికిన వస్తువులతో వారిపై దాడికి దిగింది.

షణ్ముగవేల్ కూడా దొంగల చేతిలో వేటకత్తులు ఉన్నా వెనుకాడకుండా ఓ ప్లాస్టిక్ కుర్చీతో వారిపై ఎదురుదాడికి దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది. షణ్ముగవేల్ దంపతుల మొండిధైర్యం చూసి ఆ దొంగలు పారిపోయారు. ఇప్పుడీ వృద్ధ దంపతుల సాహసాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, స్వాతంత్ర్య దినోత్సవం నాడు అవార్డు అందించింది. సీఎం పళనిస్వామి చేతులమీదుగా పురస్కారం అందించారు.

More Telugu News