TRS: టీఆర్ఎస్ నేత కేటీఆర్ కు రాఖీ కట్టిన సోదరి కవిత!

  • నేడు రాఖీపండుగ
  • రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్న కవిత
  • సోదరికి స్వయంగా స్వీట్ తినిపించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈరోజు రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సోదరి కల్వకుంట్ల కవిత కేటీఆర్ కు రాఖీ కట్టారు. అనంతరం ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సోదరికి కేటీఆర్ స్వీట్ తినిపించి రాఖీపండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయమై కేటీఆర్ స్పందిస్తూ కొన్ని అనుబంధాలు చాలా ప్రత్యేకమైనవని వ్యాఖ్యానించారు. 

More Telugu News