Andhra Pradesh: చంద్రబాబు ఇంట్లో స్వాతంత్ర్య దిన వేడుకలు.. పాల్గొన్న టీడీపీ అధినేత, లోకేశ్, దేవాన్ష్!

  • హైదరాబాద్ లోని నివాసంలో జెండా ఆవిష్కరణ
  • మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు
  • ట్విట్టర్ లో వివరాలు పంచుకున్న లోకేశ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు స్వాతంత్ర్య దిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని ఇంట్లో చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ చిత్రపటానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మనవడు దేవాన్ష్, ఇతర టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆనాటి మహానుభావుల స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని లోకేశ్ తెలిపారు. 

More Telugu News