Puri Jagannadh: కష్టాల్లో ఉన్న వేళ బంగారు గొలుసిచ్చిన అలీ... తలచుకుని పూరీ జగన్నాథ్ భావోద్వేగం!

  • అలీ కోసం పదేళ్ల వయసులో 50 కిలోమీటర్ల ప్రయాణం
  • అన్నీ పోగొట్టుకున్న వేళ ధైర్యం చెప్పిన అలీ
  • కష్టమొచ్చినా, సుఖమొచ్చినా వెన్నంటి ఉంటాడన్న పూరీ

టాలీవుడ్ కమేడియన్ అలీతో తనకున్న అనుభవాన్ని ఓ వేదికపై పంచుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్, కన్నీరు పెట్టుకోగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను 10 సంవత్సరాల వయసులో ఉన్నవేళ, తునిలో ఓ కార్యక్రమానికి అలీ వస్తున్నారని తెలిసి 50 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లానని అన్నారు. ఆ సమయంలో తనకన్నా పొట్టిగా ఉన్న అలీ, అమితాబ్ పాటలకు డ్యాన్స్ లు చేసేవాడని చెప్పారు.

తాను వరుస ఫ్లాప్ లను తీసి, ఇల్లు, ఆఫీసులను కూడా పోగొట్టుకున్న వేళ, అలీ, రూ. 3 లక్షల విలువైన బంగారు గొలుసును ఇచ్చాడని, మూడేళ్లలోనే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతావని ధైర్యం చెప్పాడని పూరీ గుర్తు చేసుకున్నాడు. అలీ దీవెనలతో తిరిగి తనకన్నీ లభించాయని అన్నాడు. తనకేదైనా ఫెయిల్యూర్ వస్తే ఓ పెగ్ పోసి, భుజం తట్టి వెళ్లిపోతాడని, హిట్ వస్తే, ఓ బొకేతో వచ్చి హగ్ ఇచ్చి వెళతాడని, కష్టమొచ్చినా, సుఖం వచ్చినా, చెప్పకుండా వచ్చి తోడుగా నిలిచే వ్యక్తి అతనేనని చెప్పాడు. 

More Telugu News