Andhra Pradesh: గుంటూరులో క్లాస్ మేట్ పై ఇంజనీరింగ్ విద్యార్థుల అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్!

  • గుంటూరులోని పేరేచర్లలో ఘటన
  • స్నేహితుడితో కలిసి యువతిపై రేప్
  • వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగికదాడి

స్నేహం ముసుగులో ఓ యువకుడు తన స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితుడిని పిలిపించి ఇద్దరూ కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి బెదిరించడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లాలోని పేరేచర్లలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అదే ప్రాంతానికి చెందిన యువతి చదువుతోంది. ఈ సందర్భంగా యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు ఇటీవల ఆమెను బైక్ పై బయటకు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తన స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడకు పిలిపించిన యువకుడు, స్నేహితుడితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని ఇద్దరూ వీడియో తీశారు.

అనంతరం ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటన తర్వాత యువతిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో యువతి అనారోగ్యానికి గురికాగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు గుంటూరు అర్బన్ లోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More Telugu News