Adivi Sesh: అలాంటి భయం నాకు లేదు: హీరో అడివి శేష్

  • అడివి శేష్ హీరోగా రూపొందిన 'ఎవరు'
  • రేపు ప్రేక్షకుల ముందుకు 
  • హిట్ ఖాయమంటోన్న శేష్    

అడివి శేష్ కథానాయకుడిగా 'ఎవరు' నిర్మితమైంది. వెంకట్ రాంజీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో అడివి శేష్ బిజీగా వున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ .. "సాధారణంగా ప్రీమియర్స్ వేయడానికి కొంతమంది భయపడుతుంటారు. ఒకవేళ సినిమా బాగోలేకపోతే ఆ టాక్ బయటికి వెళ్లిపోతుందని ఆందోళన చెందుతుంటారు.

ఈ సినిమా విషయంలో నేను అలా భయపడటం లేదు. సినిమా ఇండస్ట్రీతో సంబంధమేలేని ఒక వెయ్యిమందికి 'ఎవరు' చూపించాను. థియేటర్లో వాళ్లు మాత్రమే ఉండేలా చూశాను. సినిమా పూర్తయిన తరువాత ఎలా వుందని ఎవరినీ అడగొద్దని బయటనే వున్న నా మనుషులకు చెప్పాను. ఆ వెయ్యిమంది ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో, ఈ సినిమా విజయాన్ని సాధించడం ఖాయమనే విషయం నాకు అర్థమైపోయింది" అని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. 

More Telugu News