Apple: 5జీ ఐఫోన్... ఎన్నో స్పెషల్స్ తో 11వ తరం ఫోన్ వచ్చేస్తోంది!

  • సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశం
  • మూడు వేరియంట్లలో లభించనున్న ఫోన్
  • వెనుకవైపు మూడు కెమెరాలు

యూఎస్ స్మార్ట్‌పోన్‌ దిగ్గజం ఆపిల్, తన 11వ తరం ఫోన్ గా 5జీ సదుపాయంతో సరికొత్త మొబైల్ ప్రొడక్ట్ ను త్వరలో ఆవిష్కరించనుంది. తాజాగా మీడియాకు అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ సెప్టెంబర్‌ లో మార్కెట్లోకి రానుంది. ఐఫోన్ 11ను 11 ప్రొ,  11ఆర్‌,  11మాక్స్‌ పేరిట మూడు వేరియంట్లలో విడుదల చేయనుంది. ఇక ఈ ఫోన్లలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం. వీటిపై పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ, మరింత వేగంగా పనిచేసే ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే 5జీ సాంకేతికత, వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయట. మరింత మెరుగైన బ్యాటరీతో పాటు ఫాస్ట్ చార్జింగ్, వైర్ లెస్ చార్జింగ్ తదితర సదుపాయాలూ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతి ఏటా సెప్టెంబర్ లో కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వచ్చిన యాపిల్, గత రెండేళ్లలో మాత్రం ఈ సంప్రదాయాన్ని కొనసాగించలేకపోయింది. ఈ సంవత్సరం మాత్రం కొత్త ఫోన్ సెప్టెంబర్ లోనే ప్రపంచ మార్కెట్ కు వస్తుందని సమాచారం. దీనిపై యాపిల్ అధికారికంగా ప్రకటన మాత్రం విడుదల కాలేదు.

More Telugu News