Prabhas: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ, వేదిక ఖరారు

  • 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన 'సాహో'
  • భారీస్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్
  •  ఈ నెల 30వ తేదీన అత్యధిక థియేటర్లలో విడుదల 

ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ వారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో 'సాహో' సినిమాను నిర్మించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి.

ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఈ వేడుకకి వేదిక కానుంది. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకను ఆరంభించనున్నారు. పలువురు సినీరంగ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కానున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరగడంతో, అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

More Telugu News