Ducks: సారూ... నా రెండు బాతులు పోయాయి: పోలీసులకు మహిళ ఫిర్యాదు

  • బాతులను పెంచి, వాటిని అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్న మహిళ
  • రెండు బాతులను ఎత్తుకుపోయిన చోరులు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

తాను అల్లారుముద్దుగా పెంచిన రెండు బాతులు చోరీకి గురయ్యాయని... వాటిని కనిపెట్టి తనకు అప్పగించాలంటూ 50 ఏళ్ల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని ఈరోడ్ తాలూకా అనైకల్ పాళయంలో కుప్పమ్మాళ్ అనే మహిళ నివసిస్తోంది. ఆమె ఇంటి వెనుక ఉన్న పశువులపాకలో బాతులు పెంచుతూ, వాటిని అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తోంది. ఇటీవల రెండు బాతులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటనపై ఈరోడ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. తన బాతులను తనకు అప్పగించాలని కోరారు. ఈ ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును ప్రారంభించారు.

More Telugu News