august 15: అమరావతిలో జగన్‌...కర్నూల్‌లో బొత్స...శ్రీకాకుళంలో వెల్లంపల్లి.. రేపు జెండా ఆవిష్కరించేది వీరే!

  • జిల్లాల వారీ జాబితా విడుదల చేసిన సర్కారు
  • స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు
  • అధికారంలోకి వచ్చాక తొలి పండుగ

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రేపు జెండా ఎగురవేస్తారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ కర్నూల్‌లోను, వెల్లంపల్లి శ్రీనివాస్‌ శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో జెండా ఎగురవేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక తొలి పండుగ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్కారు ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేసే వారి జాబితాను సర్కారు విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, తూర్పుగోదావరిలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, చిత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామిలు జెండా ఆవిష్కరిస్తారు. అలాగే ప్రకాశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరులో మంత్రి సుచరిత, అనంతపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశాఖలో మంత్రి మోపిదేవి, గుంటూరులో మంత్రి పేర్ని నాని జెండా ఎగురవేయనున్నారు.

More Telugu News