Vijayawada: టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి గంటా, కేశినేని డుమ్మా!

  • విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం 
  • అసంతృప్తితో ఉన్న గంటా, కేశినేని?
  • పీఏసీ చైర్మన్ పదవి ఆశించి భంగపడిన గంటా 

విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గంటా డుమ్మా కొట్టారు. చంద్రబాబు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పీఏసీ చైర్మన్ పదవి తనకు దక్కకపోవడంతో గంటా అలకబూనారని, కృష్ణా జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు కేశినేనికి నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.

More Telugu News