Varun Tej: 'వాల్మీకి' నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
  • డిఫరెంట్ లుక్ తో వరుణ్ తేజ్ 
  • సెప్టెంబర్ 13వ తేదీన విడుదల   

వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' రూపొందింది. తమిళంలో ఆ మధ్య వచ్చిన 'జిగర్తాండ'కి ఇది రీమేక్. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అధర్వ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు.

డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆయన భావిస్తున్నాడు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. తెలుగులో అధర్వ మురళి తొలిసారిగా నటించిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.

More Telugu News