Hyderabad: దొంగ తెలివి!... రాత్రంతా స్టోర్ లో దాక్కుని రూ.10 లక్షల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లాడు!

  • హైదరాబాద్ షేక్ పేటలో ఘటన
  • కస్టమర్ లా స్టోర్ లో ప్రవేశించి దాక్కున్న దొంగ
  • తెల్లవారిన తర్వాత ఫైర్ ఎగ్జిట్ ద్వారం నుంచి బయటికి వెళ్లిన వైనం

హైదరాబాద్ షేక్ పేట నాలా వద్ద ఉన్న రిలయన్స్ మార్ట్ లో రూ.10 లక్షల విలువైన స్మార్ట్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో ఆసక్తికర విషయం వెల్లడైంది. రాత్రి వేళ ఓ వ్యక్తి కస్టమర్ లాగా వచ్చి ఓ మూల దాక్కున్నాడు. అతడిని రిలయన్స్ మార్ట్ సిబ్బంది గుర్తించలేదు. రాత్రి 10 గంటల సమయంలో స్టోర్ మూసివేసి వెళ్లిపోయారు. అయితే లోపల దాగిన ఆ వ్యక్తి రాత్రంతా అక్కడే ఉండి, ఓ 30 స్మార్ట్ ఫోన్లను బ్యాగులో సర్దుకున్నాడు. తెల్లవారగానే ఫైర్ ఎగ్జిట్ ద్వారం నుంచి జారుకున్నాడు. ఫోన్లు గల్లంతైన విషయం గుర్తించిన స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగ రాత్రంతా స్టోర్ లోనే ఉన్నట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

More Telugu News