Jagan: రోడ్డు పక్కన చిన్న టెంటులో పడుకునేవాడ్ని: సీఎం జగన్

  • సీఎం క్యాంపు కార్యాలయంలో 'జయహో' పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • పాదయాత్ర రోజులను గుర్తుచేసుకున్న జగన్
  • రోజంతా ప్రజల సమస్యలు తెలుసుకునేవాడ్నంటూ వెల్లడి

సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి రాసిన 'జయహో' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని స్పష్టం చేశారు. పాదయాత్ర సందర్భంగా మూడు వేల కిలోమీటర్లకు పైగా తిరిగానని, ఆ సమయంలో రోడ్డు పక్కన చిన్న టెంటులో పడుకునేవాడ్నని జగన్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ పాదయాత్రను తలుచుకుంటే గొప్ప ఉత్సాహం కలుగుతుందని చెప్పారు. పగటి వేళ అంతా ప్రజల సమస్యలు తెలుసుకునేవాడ్నని, ఆ విధంగా ప్రజల కష్టనష్టాలపై తనకు అవగాహన ఏర్పడిందని అన్నారు.  అందుకే ఇప్పుడు ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసమే పరిపాలన సాగిస్తున్నానని తెలిపారు.

More Telugu News