Andhra Pradesh: గుంటూరు జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు!

  • సత్తెనపల్లిలోని కట్టమూరులో ఘటన
  • ఆఫీసుకు మంటపెట్టి పరారైన నిందితులు
  • మంటల్లో పాక్షికంగా కాలిపోయిన కార్యాలయం

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం కట్టమూరులో గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. కార్యాలయానికి మంటలు అంటుకోవడాన్ని గమనించిన టీడీపీ శ్రేణులు వాటిని ఆర్పేశాయి.

అయితే ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది. ఈ వ్యవహారంపై టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్యాంసుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News